విశాఖ: ఆర్కే బీచ్ వద్ద సముద్రం నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరొకరిని అక్కడే ఉన్న మత్స్యకారులు సురక్షితంగా బయటకులాగారు. మహా శివరాత్రి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చి సముద్రంలో ఈతకు దిగి గల్లంతైనట్లుగా సమాచారం. మృతులు ఈస్ట్ పాయింట్ కాలనీకి చెందిన కే రోహిత్, పెద్ద జాలరిపేటకు చెందిన జే సింహాద్రిగా గుర్తించారు.
కాగా, సముద్రంలో ఈతకు దిగిన తర్వాత రోహిత్ అనే విద్యార్థికి మూర్ఛ రావడంతో నీట మునిగిపోయాడు. పవన్ అనే మరో విద్యార్థి అలల తాకిడికి కొట్టుకుపోయాడు. స్థానిక ఈతగాళ్లు చొరవ తీసుకుని అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.
రోహిత్, సింహాద్రి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ప్రాణాలతో బయటపడిన పవన్ను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.