అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగింది.
కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో దేవరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు (శ్రీను39), కడలి రాజేంద్ర(32) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.