శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ముగ్గురిపై దాడిచేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.