అమరావతి : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నెల్లూరు దర్తి మండలంలో ప్రమాదం చోటు చేసుకున్నది. భవానీ స్వాములు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.