అమరావతి : కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం బన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది . మృతులు ప్రకాశం జిల్లా వెల్లటూరు గ్రామానికి చెందిన నాంచారయ్య(25), మల్లికార్జున(23) గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక పోస్టుమార్టం గదికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.