అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో బీ.ఆర్.నగర్ వద్ద చోటు చేసుకుంది . జోనాగాడ్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న రైలు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. గుర్తు పట్టలేని స్థితిలో మృత దేహాలు ఉండడంతో మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందు కున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.