అమరావతి : పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగిఉన్న ఆటోను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈదర రమణయ్య(53), ఈదల మల్యాద్రి(45) మృతి చెందారు.
ఆటోలో ఉన్న మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.