అమరావతి : విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద విషాదం చోటు చేసుకుంది. గోస్తని నది చెక్డ్యామ్ (Check dam) లో మునిగి ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. విజయనగరంలోని కంటోన్మెంట్కు చెందిన ఆరుగురు యువకులు(Youth) ఉదయం ఈత కోసం చెక్డ్యామ్ వద్దకు వెళ్లారు.
ఆరుగురు యువకుల్లో ముగ్గురు గల్లంతు కాగా అశోక్(19), షాకిత్(16) మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన రజిక్(14) కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చేతికొచ్చిన కొడుకులు మృత్యువాత పడడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.