అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఒంటిమిట్ట (Vontimitta) చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఒంటిమిట్ట వద్ద అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు సజీవ సమాధి అవగా, మరో ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో చెరువులో నుంచి కారును బయటకు తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను చంద్రగుప్త, కేదార్నాథ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.