శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా నాగావళి నది (Navavali river) లో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు గల్లంతు కాగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు. విశాఖపట్నంకు చెందిన ముగ్గురు బాలురు పుట్టిన రోజు ( Birthday ) సందర్భంగా బుధవారం నాగావళి నదిలో స్నానానికి వెళ్లారు.
స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బాలురు కార్తికేయ(11), గణేశ్గౌతం(7) నదిలో గల్లంతు కాగా మరో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు మృతదేహాలు సమీప ప్రాంతంలో లభ్యం అయ్యాయి. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.