TTD-Ayodhya | అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా తన వంతు పాలు పంచుకుంటున్నది. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ప్రాణ ప్రతిష్ట కోసం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు పంపడానికి టీడీడీ ఏర్పాట్లు చేస్తున్నది.అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను టీటీడీ పంపించనున్నది. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుంది.
ఈ నెల 20 లోపు అయోధ్యకు లక్ష లడ్డూలు రవాణా చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్దం చేసింది. ఇన్ చార్జి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీ వీరభద్రం పర్యవేక్షణలో లడ్డూల తయారీ, ప్యాకింగ్ ప్రక్రియ జరుగుతున్నది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపాలని టీటీడీ చైర్మన్ సారధ్యంలోని భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ట్రస్ట్ నిర్ణయించిందని వీ వీరభద్రం తెలిపారు.
అయోధ్యకు లడ్డూలు పంపించడానికి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1లో శ్రీవారి సేవకులు ఒక ప్యాకెట్ లో రెండు లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సుల్లో ఈ లడ్డూ ప్యాకెట్లు ప్యాక్ చేశారు. ఈ కార్యక్రమంలో 350 మంది శ్రీవారి సేవకులు, టీటీడీ డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్, పోటు ఏఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.