తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తే భక్తుల కోసం వసతి కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా వర్చువల్ ఆర్జిత సేవలు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లను విడుదల చేస్తున్నది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవల ప్రత్యేక దర్శను కోటాను ఉదయం 11 గంటలకు వెబ్సైట్లో విడుదల చేయనుంది.