హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మరోసారి అపచారం చోటుచేసుకొన్నది. శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. కొందరు భక్తులు ఈ సందర్భంగా వీడియో తీశారు. గత కొంతకాలంగా తిరుమల కొండపై నుంచి తరచూ విమానాలు వెళ్తున్నాయి. ఓ రోజు ఏకంగా 6 విమానాలు ఆలయం మీదుగా వెళ్లడం కలకలం రేపింది. ఇది ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, భక్తులు ఆందోళన చెందుతున్నా, విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
తాజాగా ఆలయం మీదుగా వెళ్లిన విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా, లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది. ఏటీసీ అధికారులు మాత్రం తిరుమల నో ఫె్లై జోన్ కాదని పేర్కొంటున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం పరిధిలో ఉండటంతో గతంలోనే టీటీడీ ఈ నోఫె్లై జోన్ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు కేంద్ర హోంశాఖ అధికారులు తిరుమలకు వచ్చిన సమయంలో కూడా టీటీడీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. కానీ వారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆగమశాస్త్రంతో పాటు భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ప్రస్తుతం తిరుమలను నో ఫ్లైజోన్గా ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.