TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13న ఉదయం 9 గంటలకు టికెట్లను ఆన్లైన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు జనవరి కోటాను జనవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలాలయం కార్యక్రమం సందర్భంగా ఆయా రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయలేదు. బాలాలయాన్ని వాయిదా వేయగా.. టికెట్లను విడుదల చేయనున్నది. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.