తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 1న శ్రీవారి దర్శనానికి 20 వేల టికెట్లు, వచ్చేనెల 2 నుంచి 12 వరకు రోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేస్తారు. ఇక 13 నుంచి 22 వరకు రోజుకు 20 వేల టికెట్లు, జనవరి 23 నుంచి 31 వరకు రోజుకు 12 వేల చొప్పున టోకెన్లను అందుబాటులో ఉంచుతారు.
కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి ప్రత్యేక, సర్వ దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకు పరిమిత సంఖ్యలో భక్తులకు టొకెట్లను అందుబాటులో ఉంచుతున్నది. తద్వారా తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతోపాటు, కరోనా వ్యాప్తిని నిలువరించగలుగుతుంది.