తిరుమల : ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో టికెట్లను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.