తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్సైట్లో స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది.