Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లు ఇవాళ ఉదయం 9 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.