Tirumala | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమసే తెలంగాణ): తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుప కంచె ఏర్పాటు అవకాశాలను టీటీడీ పరిశీలిస్తున్నది.
ఇప్పటికే ఇనుపకంచె ఏర్పాటుకు కేంద్రం అనుమతులను టీటీడీ కోరింది. అవకాశాల పరిశీలనకు ఈ నెల 12న ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది.