తిరుమల : బ్రహ్మోత్సవాల్లో మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించే సమయంలో వాహనాలపై భక్తులు నాణేలు విసరవద్దని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోరారు. నాణేల విసరడం వల్ల అర్చకులు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున నాణేలను గారి ఇతర వస్తువులను గాని మానుకోవాలని కోరారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, తమ సొంత గాజులు లేదా స్టీల్ బాటిళ్లను తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలలో టీటీడీ ప్లాస్టిక్ నిషేధం విధించినందున భక్తు లు తమ సౌకర్యార్థం స్టీల్ లేదా రాగి లేదా గాజు సీసాలను సొంతంగా తీసుకెళ్లడం మంచిదని వెల్లడించారు.