తిరుపతి : శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీ(Ayurvedic Pharmacy) లో నూతనంగా నిర్మించిన మందుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (TTD JEO )సదా భార్గవి గురువారం పరిశీలించారు. అనంతరం ఎస్వీ గోశాల(SV Goshala) లో నిర్మించిన పరిమళ భరిత అగర బత్తీల తయారీ రెండో యూనిట్ , నూతనంగా నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్(feed mixing plant) ను పరిశీలించారు.
శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి ఈ మూడు ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జేఈవోపరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఈఈ లు మనోహర్, మురళీకృష్ణ, డి ఈ సరస్వతి, ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారప రెడ్డి పాల్గొన్నారు.