తిరుపతి : శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురికి గాయాలయ్యారు. దీంతో ఆ ముగ్గురు భక్తులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.
రెండు రోజుల విరామం అనంతరం సర్వదర్శనం టోకెన్లను ఇవాళ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే భక్తుల తోపులాటలో క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ మూడు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.