TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ను జారీ చేసింది. ఈ నెల 27న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 26న సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు భక్తులకు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 26న ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దుండిగల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7.45గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అదే రోజు రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. 27న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుంటారు.