TTD | వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
రోజూ వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుందని తెలిపింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుందని పేర్కొంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేసింది. అందువల్ల సోషల్మీడియాలో ప్రసారమయ్యే తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://www.tirumala.org/ లేదా https://ttdevasthanams.ap.gov.in/home/dashboardను మాత్రమే సంప్రదించాలని సూచించింది.