తిరుమల : గత ఏడాది తెలుగు బిగ్బాస్ సీరిస్లో పాల్గొన్న దివ్వెల మాధురి( Divvela Madhuri) , తనూజ ( Tanuja) పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనూజ పుట్టినరోజు సందర్భంగా గురువారం బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధంలో ఉన్న సందర్భంగా ఇద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.