తిరుమల: తిరుమలలోని పూలతోటలను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. బాట గంగమ్మ గుడి సమీపంలోని శ్రీవారి సేవా సదన్కు ఆనుకుని ఏడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నఉద్యానవనాన్నిఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గులాబీ మొక్కను నాటారు.
శ్రీ సిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నగులాబీలు, మల్లెలు, ఇక్సోరా, లిల్లీ వంటి పూల మొక్కలను ఈఓ పరిశీలించారు. రానున్న రెండు నెలల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యపూజకు వినియోగించే 100-150కిలోల పూలను ఈ తోటల ద్వారా లభ్యమవుతాయని శ్రీసిటీ గ్రీనరీ ప్రాజెక్ట్ ఇన్చార్జి మధురెడ్డి ఈఓకు వివరించారు. రోజువారీ కైంకర్యాలకు అవసరమైన పసుపును కూడా ఇక్కడే సాగు చేస్తున్నారు.