TTD EO | టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగినప్పుడు ఈవోగా ఉన్నారని, ఆయన్ను బదిలీ చేయాలని సిట్ చేసిన సూచనతో అనిల్ సింఘాల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈవో పదవి నుంచి తొలగించింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది.

Ttd Eo Anilkumarsinghal