TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో తొలిసారిగా ప్రయోగాత్మకంగా సోమవారం పరిశీలించారు. ట్రయల్ రన్లో భాగంగా దాదాపు 5వేల మంది భక్తులకు ఉల్లిపాయలు వాడకుండా చేసిన మసాలా వడలను వడ్డించారు. మంగళవారం నుంచి సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.
కొద్ది రోజులు ట్రయల్ రన్ కొనసాగించనున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించి.. మెనూకు రూపకల్పన చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది రథసప్తమి నుంచి పూర్తిస్థాయిలో అందరు భక్తులకు వడ్డించేలా ఏర్పాట్లు చేస్తున్నది. తొలిసారిగా ప్రయోగాత్మకంగా మసాలా వడలు వడ్డించగా.. భక్తులు రుచికరంగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు వడ్డించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు టీడీపీ అధికారులు తెలిపారు.