తిరుమల : ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandra Babu ) ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( TTD Chairman BR Naidu) , ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు జానకి దేవి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు.
ఈ మేరకు బుధవారం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో వివరించారు.