TTD | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే మార్చి, ఏప్రిల్తో పాటు మే మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
లక్కీడీప్ విధానంలో కేటాయించే సేవా టికెట్ల కోసం బుధవారం ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అదే సమయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన కోటాను సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు భక్తులు గమనించి.. సహకరించాలని విజ్ఞప్తి చేసింది.