తిరుమల : రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) కూలిపోయిందని అన్నారు. అయితే ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు శరవేగంగా పూర్తిచేసేందుకు రాత్రి -పగలు పనులు చేస్తున్నారని అన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ ఘాట్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని, భారీ వాహనాలకు మాత్రం అనుమతి లేదని, వీటిని లింక్ రోడ్డు ద్వారా వెళ్లేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.