విశాఖ : ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో విశాఖ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మురళీ నగర్, బీచ్ రోడ్డ, అక్కయపాలెం, మధురానగర్, కంచరపాలెం, తాడిచెట్లపాలెంలోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.