అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కొత్తపేట మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తపేట మండలంలోని మందపల్లిలో బైకును పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను అప్పన సత్యవతి, వెంకట లక్ష్మి, మహేశ్గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కుమారుడు, నానమ్మ అని పోలీసులు తెలిపారు. కొత్తపేట నుంచి రావులపాలెం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.