అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Officers Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక సీఎస్గా జి. అనంతరాము(Ananta Ramu) , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా ( RP Sisodia ) ను నియమించింది.
సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా జి. జయలక్ష్మి (G. Jayalakshmi) , ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కమిషనర్గా, జీఏడీ కార్యదర్శిగా సురేశ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్విగా సౌరబ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ, సంక్షేమశాఖ కార్యదర్శిగా హర్షవర్దన్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శిగా పి. భాస్కర్ను నియమిస్తూ ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ ను నియమించింది.
సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కె.కన్నబాబును నియమించింది. పర్యాటకశాఖ కార్యాదర్శిగా వినయ్చంద్, యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్, మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా సూర్యకుమార్ను నియమించింది.
ఇండస్ట్రీస్ డైరెక్టర్గా సి. శ్రీధర్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జె.నివాస్కు పోస్టింగ్ కల్పించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా విజయరామరాజు, సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్గా హిమాంశు శుక్లా, వ్యవసాయశాఖ డైరెక్టర్గా ఢిల్లీరావుకు పోస్టింగ్ ఇచ్చారు.
Girl Missing | మూడు రోజులుగా లభ్యం కాని బాలిక ఆచూకి .. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు