అమరావతి : ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కడప శివారులోని ఖాదర్ గాని కొట్టాల గ్రామంలో ఇంటి డాబాపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో చిన్నారులు శశాంక్(12), మనోజ్(4) అక్కడికక్కడే మృతి చెందారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటి వరకు కళ్లేదుట ఆడుకున్న ఇద్దరు కొద్ది నిమిషాల్లోనే విగతజీవులుగా మారడం పట్ల చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.