అమరావతి : స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మురికి కాల్వలో(Open drinage) పడి గల్లంతైన బాలుడి(Boy) మృతి దేహం లభ్యమైన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని మురికి కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం నగరంలోని గురునానక్ కాలనీలో అభి అనే బాలుడు ఆడుకుంటూ మురికి కాల్వలో పడిపోయాడు.
దీంతో బాలుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో స్థానికులు మురికి కాల్వలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీం(Disaster Response Force) అక్కడికి చేరుకుని వారు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 5 గంటల అనంతరం కిలోమీటర్ దూరంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.