అమరావతి : బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ సింగినగరం చెందిన విద్యార్థులు విహారయాత్ర కోసం సూర్యలంక బీచ్కు చేరుకున్నారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు బీచ్లో స్నానం చేస్తూ గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చా రు.మిగిలిన నలుగురికి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు అభి (15),సిద్ధూ (15) గా గుర్తించారు. వీరు ఇంటర్మీ డియట్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు.