అమరావతి : పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది . కుటుంబ కలహాల కారణంగా కృష్ణవేణి అనే మహిళను ఆమె బంధువు వెంకట రమణారెడ్డి తన ద్విచక్రవాహనంపై పుట్టింటికి తీసుకెళ్తున్నాడు. ముప్పాళ్ల మండలం నార్నెపాడు మేజర్ కాలువ వద్ద వాహనాన్ని ఆపిన కృష్ణవేణి ఆకస్మత్తుగా కాలువులో దూకింది.
ఆమెను కాపాడేందుకు కాలువలో దూకిన వెంకట రమణారెడ్డి ఈత రాక గల్లంతయ్యాడు. కొద్ది సేపటి తరువాత అతని మృతదేహం లభ్యం కాగా మరికొద్ది సేపటికి కృష్ణవేణి మృతదేహం లభించింది. మృతులు సత్తెన్నపల్లి మండలం పాకలాపాడుకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.