విజయవాడ: సాంబార్ రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. ఈ ఊహకందని విషాదం కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్నది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న ఆ చిన్నారి.. ఒక్కసారిగా సాంబార్ గిన్నెలో పడటంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో విస్సన్నపేట దళితవాడలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
కృష్ణాజిల్లా విస్సన్నపేట దళితవాడలోని ఓ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. అప్పటివరకు ఆ కుటుంబం, వారి బంధువులు ఎంతో హ్యాపీగా గడిపారు. భోజనాలు వడ్డిస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో బర్త్డే ఫంక్షన్కు తల్లిదండ్రులతో వచ్చిన ఓ రెండేండ్ల చిన్నారి అప్పటివరకు కుర్చీలో కూర్చున్నది. ఉన్నట్లుండి పక్కనే ఉన్న వేడి వేడి సాంబార్ గిన్నెలో పడిపోయింది. దాంతో తీవ్రంగా గాయాలవగా తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. పాప మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.