అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పాత బావి పూడికతీతకు దిగిన నలుగురికి ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. జిల్లాలో కురిసిన వర్షాల తో బావిని పునరుద్ధరించుకోవడానికి ఇంటి యజమాని నలుగురు కూలీలను సంప్రదించాడు.
ఇంటి యజమాని తండ్రి, కొడుకులు వంజల రామారావు, లక్ష్మణరావులతో పాటు కూలీలు రంగా అతడికి సహయకుడిగా శ్రీనివాసరావు పూడికతీతకు బావిలో దిగారు. కొద్దిసేపటికే వారికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు.