అమరావతి: రోజువారి జీవనం కోసం చెత్తకుప్పలపై ఆధారపడ్డ కూలీ పేలుడుతో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాపులపాడు మండలం ఎ.సీతారాంపురం గ్రామంలో పాత ఇనుము కోసం చెత్తకుప్పలో వెతుకుతుండగా ఒక్కసారిగా పేలుడు సంబవించింది. దీంతో పేలుడు ధాటికి పాపారావు(35) అనే కూలీ దుర్మరణం పాలయ్యాడు. పేలుడుకు కారణాలపై వీరవల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.