అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. ఒకే ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య ( Brothers Suicide ) చేసుకున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్తూరు గ్రామంలో కుటుంబ కలహాలతో లంకోటి కోటేశ్వర్వరావు ( 29), లంకోటి సీతారామయ్య ( 27 ) అనే ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం సృష్టించింది.
అన్నదమ్ముల ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం వివరాలు సేకరించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పల్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.