అమరావతి : ఏపీలోని అనంతపురం( Anantapuram) జిల్లా తాడిపత్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి ఆర్థికంగా కుంగిపోయి భార్యతో గొడవపడి ఆమెను, కుమార్తెను హత్య చేసిన 24 గంటల్లోనే నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని యాడికి గ్రామంలో చోటు చేసుకుంది .
మగ్గం పనిచేసుకునే రామకృష్ణకు అయిదేళ్ల కిందట యాడికికి చెందిన చంద్రావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలున్నారు. క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న రామకృష్ణ భార్యతో తరచు గొడవపడేవాడు. గురువారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆమె పడుకున్న సమయంలో ఆమె ముఖంపై దిండుతో అదిమి చంపివేయగా తొమ్మిది నెలల చైత్రికపై బియ్యం బస్తా ఉంచి పరారయ్యాడు. పెద్ద కూతురు అమ్మమ్మ ఇంటో ఉంటూ చదువు కుంటుండడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది .
మరుసటి రోజు ఉదయం రామకృష్ణ చరవాణికి సోదరుడు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ రావడంతో ఇంటికి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. స్థానికుల సహాయంతో ఇంటిలోకి వెళ్లి చూడగా ఇద్దరు మృతదేహాలు వెలుగుచూశాయి. పోలీసులకు సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు(Police case) చేశారు.
కాగా శనివారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పొలమడ వద్ద రైలు కింద పడి వ్యక్తి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతుడు యాడికికి చెందిన రామకృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.