అమరావతి : తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు యత్నించిన ఇద్దరు అభిమానులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషాద ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) లో చోటు చేసుకుంది. హీరో సూర్య (Surya) జన్మదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు నక్కా వెంకటేశ్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు ఆదివారం ఫ్లెక్సీలు ( Flexi ) కడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నరసరావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.