అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు పడిగాపులు కాచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మన్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో సీఎస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తు వెనుతిరిగారు.
ప్రభుత్వ తీరుపై గురువారం సమావేశమై కార్యచరణను భవిష్యత్ కార్యచరణను రూపొందించుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్ తెలిపారు.