అమరావతి : కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో శాంతమ్మ అనే మహిళా మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వారు పేర్కొన్నారు.