అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను రక్షించారు.
గాయపడ్డ వారిని సమీప దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.