అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు(శనివారం) అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13న రెండవ శనివారం అయినప్పటికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించడంతో ఆరోజున సెలవును రద్దు చేసి ఈనెల 27న సెలవును ప్రకటించింది . దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.