అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తెలిపారు. 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కఠినచర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
మహిళలకు ఏదేని ప్రమాదం జరిగితే నిమిషాల్లో అక్కడికి చేరి వారిని ఆదుకునేందుకు దిశయాప్ను తీసుకొచ్చామని, ఇప్పటి వరకు 1.16 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలు, 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభించి నట్లు అన్నారు. పోలీసు మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదుల కోసం క్యార్వాన్ వాహనాలను అందుబాటులో ఉంచామని జగన్ పేర్కొన్నారు.