తిరుమల : తిరుమలలో సర్వ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు వెయ్యి చొప్పున రేపటి నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించి టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఎల్లుండి కోసం తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇవాళ జారీ చేస్తున్నామని తెలిపారు. ఎల్లుండి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కాగా నిన్న శ్రీవారిని 68,009 మంది భక్తులు దర్శించుకోగా 39,518 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు వచ్చిందని వివరించారు.